Boney Kapoor: అలా ప్లాన్‌ చేసుకున్నాం.. కానీ అంతలోనే విధి వక్రీకరించింది

Sridevi Death Anniversary: Boney Kapoor Pens Emotional Post - Sakshi

Sridevi Death Anniversary: Boney Kapoor Pens Emotional Post: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అకాల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఎన్నో అనుమాల మధ్య శ్రీదేవి మరణాన్ని నిర్ధరించారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్​లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి నటన, అందం, అభినయాన్ని సినీలోకం గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఎవర్​ గ్రీన్​ హీరోయిన్​గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి గురువారం కావడంతో ఆమె ఙాపకాలను నెమరువేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్​ ఎమోషనల్​ పోస్ట్​ చేశాడు. వెనిస్​లో బోనీ కపూర్ శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగమైన కోట్స్​ రాశాడు. 'మేము సెప్టెంబర్​ 7, 2008న మిలన్​ నుంచి వెనిస్​కు వెళ్లాం. ఆ నగరంలో కొన్ని గంటలు మాత్రమే గడిపాం. మేము వెనిస్​ని మళ్లీ సందర్శించాలని ప్లాన్​ చేసుకున్నాం. కానీ మా ప్రణాళికలను విధి తిరస్కరించింది.' అంటూ ఎమోషనల్​గా పోస్ట్ చేశాడు బోనీ కపూర్​. అలాగే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్​ గతంలో తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్​ చేసింది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top