రుద్రసింహ సినిమా షూటింగ్ పూర్తి
సంతోష్ హీరోగా, స్నేహ, మైత్రి హీరోయిన్లుగా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్ర సింహా’. మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, కోటేశ్వర్ రావు జింకల నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘యాక్షన్, రివెంజ్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఏడు పాటలు, ఐదు ఫైట్స్తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవడంతో పాటు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు.
చదవండి: మరోసారి మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్..
మే నాలుగో వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే!