చలం భావజాలంతో... | Rallalo Neeru movie ready to release | Sakshi
Sakshi News home page

చలం భావజాలంతో...

Nov 17 2020 6:08 AM | Updated on Nov 17 2020 6:08 AM

Rallalo Neeru movie ready to release - Sakshi

పలు రచనలు చేయడంతో పాటు, అనేక డాక్యుమెంటరీలు తీసిన కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రాళ్ళలో నీరు’. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని అనల్ప నిర్మించారు. ‘‘తెలుగులో ‘కన్యాశుల్కం’లా ఇంగ్లిషులో ‘ఏ డాల్స్‌ హౌస్‌’ ఫేమస్‌. 19వ శతాబ్దానికి చెందిన రచయిత హెన్రిక్‌ ఇబ్సన్‌ ఈ నాటకం రాశారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్‌ థాట్స్‌ (ప్రగతిశీల ఆలోచనలు)తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేశాను. ఇందులో ఐదు పాత్రలే ఉంటాయి. సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే లాస్‌ఏంజిల్స్‌లో ‘అవేర్నెస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement