Puneeth Rajkumar: త్వరలో పునీత్‌ సమాధి వద్ద పెళ్లి చేసుకొంటాం

Puneeth Rajkumar Fans Wedding At Kanteerava Stadium - Sakshi

బెంగళూరు: కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధిని బుధవారం నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు దర్శించుకొంటున్నారు. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్‌కు వీరాభిమానులు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరు శనివారం పునీత్‌ సమాధిని దర్శించుకున్నారు. త్వరలో ఇక్కడే పెళ్లి చేసుకొంటామని తెలిపారు. ఇందుకు శివరాజ్‌కుమార్‌ కూడా సమ్మతించారని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పునీత్‌కు అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. చామరాజనగర వద్ద జరిగిన గోరె హబ్బలో రాజ్, పునీత్‌ల చిత్రాన్ని ప్రదర్శించారు.  

చదవండి: (పునీత్‌కు అప్పటికే చెమటలు పట్టాయి.. అందుకే అక్కడకు వెళ్లాలని సూచించా..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top