కథ క్లైమాక్స్‌కి వచ్చింది

Prabhas gifts wristwatches to Radhe Shyam team - Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శనివారంతో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశారట చిత్రబృందం. దీంతో షూటింగ్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇంకొక్క షెడ్యూల్‌ చిత్రీకరణతో ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ మొత్తం పూర్తి కానుందని తెలిసింది. అలానే ఈ సినిమా క్లైమాక్స్‌ ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సుమారు 15 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయట. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందానికి చేతి గడియారాలను బహుమతిగా అందించారు ప్రభాస్‌.  ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top