Adipurush Movie: 20 వేల థియేటర్లలో ఆదిపురుష్ !​.. పాన్​ వరల్డ్​ మూవీగా ప్రచారం

Prabhas Adipurush Movie Is Release Across 20000 Screens - Sakshi

'ఈశ్వర్' సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్​ స్టార్​ ప్రభాస్‌.. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. వరుస పాన్‌  ఇండియా సినిమాలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రభాస్​ క్రేజ్​ను నిర్మాతలు సైతం క్యాష్​ చేసుకుంటున్నారు. అందుకే డార్లింగ్​తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనూ ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు.

అలా ప్రభాస్​ భారీ బడ్జెట్​ చిత్రాల్లో బాలీవుడ్​ డైరెక్టర్​ ఓంరౌత్​ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్​' ఒకటి. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్​ రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని వీలైనంత త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్'​ సినిమా బడ్జెట్​, రిలీజ్​పై పలు ఆసక్తిర విశేషాలు సోషల్​ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి. 

ఆదిపురుష్​ మూవీ మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని తెలుస్తోంది. సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000  థియేటర్లలో ఒకేసారి ఆదిపురుష్​ రిలీజ్​ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని పాన్​ ఇండియా సినిమాగా కాకుండా పాన్​ వరల్డ్​ మూవీగా పిలవడంలో అనుమానం లేదని అంటున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top