ఆ విషయాన్ని పెద్దది చేసి రాశారు.. ప్రభాస్‌ ఇష్యూపై నిత్యా షాకింగ్‌ కామెంట్‌

Nithya Menon Shocking Comments on Prabhas Issue - Sakshi

‘అలా మొదలైంది’చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ నిత్యామీనన్‌.. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరరైంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తుంది ఈ భామ. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్‌ 4న విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్‌ నిర్మాతగా కూడా మారింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిత్యా.. గతంలో చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.  

ఈ క్రమంలో ప్రభాస్‌ ఇష్యూ గురించి మాట్లాడూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాను తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే టాలీవుడ్‌ సినిమాలు చూసేదాన్నికాదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్‌ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని,ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైంది. ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికి బాధ పెడుతుంది’అని నిత్యా చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top