Puneeth Rajkumar: పునీత్‌ మృతి వార్త చదువుతూ యాంకర్‌ కన్నీటి పర్యంతం

News Reader Cries While Reading Puneeth Rajkumar Death News - Sakshi

News Reader Cries While Reading Puneeth Rajkumar Death News: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్‌.. 46ఏళ్ల వయసులోనే చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్‌ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్‌ మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణం తీవ్రంగా కలివేస్తుంది. చదవండి: నెంబర్‌1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?

ఈ క్రమంలో పునీత్‌ మరణవార్తకు సంబంధించి న్యూస్‌ చదువుతూ ఓ యాంకర్‌ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్‌ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్ది సేపటి వర​కు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్‌ను కంటిన్యూ చేసింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్‌ కావడంతోపునీత్‌ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై..
అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్‌ అంత్యక్రియలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top