మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దృశ్యం. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో దృశ్యం-3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా దృశ్యం-3 మేకర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది మే 21 దృశ్యం-3 విడుదల కానుందని హీరో ట్వీట్ చేశారు. కాగా.. మొదట ఏప్రిల్ 02న విడుదల కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా కనిపించనుండగా.. హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. హిందీ దృశ్యం3 కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. కాగా..ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
The past never stays silent…it only waits.
Georgekutty arrives, May 21st 2026.#Drishyam3 | Worldwide Release @jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar @aashirvadcine @PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969… pic.twitter.com/2r8KCVe98U— Mohanlal (@Mohanlal) March 23, 2026


