స్టార్‌ మాలో కొత్త సీరియల్‌ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ | A Heartwarming Family Entertainer Unfolds with Laughter and Love in Star Maa Eto Vellipoindi Manasu | Sakshi
Sakshi News home page

స్టార్‌ మాలో కొత్త సీరియల్‌ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’

Jan 23 2024 3:40 PM | Updated on Jan 23 2024 4:05 PM

A Heartwarming Family Entertainer Unfolds with Laughter and Love in Star Maa Eto Vellipoindi Manasu - Sakshi

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు స్టార్‌మా లో మరో కొత్త సీరియల్‌ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రాబోతుంది. సునిశిత హాస్యం, ప్రేమ,ప్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సీరియల్‌ సాగుంతుందని మేకర్స్‌ తెలియజేశారు. జనవరి 22 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు స్టార్‌ మాలో ఈ సీరియల్‌ టెలికాస్ట్‌ అవుతుంది. 

సీతాకాంత్, 40 ఏళ్ల వయసు కలిగిన విజయవంతమైన వ్యాపారవేత్త . బాధ్యతలు కలిగినప్పటికీ  వినోదాన్ని అభిమానించే 20 ఏళ్ల రామలక్ష్మి పాత్రలో  రక్ష కనిపిస్తుంది. వీరి ఇరువురి జీవితాల ద్వారా ప్రేక్షకులను ఆహ్లాదకరమైన ప్రయాణంలో నడిపిస్తుంది "ఎటో వెళ్లిపోయింది మనసు".  సీతాకాంత్ పాత్రను  సీతాకాంత్ పోషించారు. ఆయన  జీవితం ఒక  క్రమ పద్దతిలో వెళ్లాలనుకుంటారు. దాని చేతనే ఆయన  ప్రసిద్ది చెందారు, అయితే రామలక్ష్మి ప్రతి సందర్భం లోనూ ఉత్సాహం తీసుకువస్తూ ,  జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య వయస్సు అంతరం వినోదభరితమైన ఘర్షణలకు దారి తీస్తుంది, హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సరైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది.

రామలక్ష్మి గతం నుంచి కుటుంబ రహస్యాలను వెలికితీసినప్పుడు, ఈ ద్వయం సంఘటనల సుడిగుండంలో తమను తాము కనుగొంటారు, ఇది సౌకర్యం కోసం చేసుకున్న వివాహంతో ముగుస్తుంది.  సీతాకాంత్ యొక్క ఖచ్చితమైన స్వభావం,  రామలక్ష్మి యొక్క నిర్లక్ష్య స్ఫూర్తితో ఢీకొంటూ ప్రేమ, నవ్వు మరియు కుటుంబ బంధాలను మిళితం చేసే ప్రయాణానికి వేదికగా నిలుస్తుంది. ప్రేమంటే  వయసు, అభిరుచుల తూకం కాదు , రెండు గుండెల చప్పుడు అని చెబుతుంది. స్టార్ మా లో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు "ఎటో వెళ్లిపోయింది మనసు" ప్రసారమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement