
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 74 ఏళ్లు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.