నటుడు 'విజయ్ దేవరకొండ'కు మరోసారి ఈడీ నోటీసులు | Enforcement Directorate Again Notice Issued To Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

నటుడు 'విజయ్ దేవరకొండ'కు మరోసారి ఈడీ నోటీసులు

Jul 24 2025 10:21 AM | Updated on Jul 24 2025 10:58 AM

Enforcement Directorate Again Notice Issued To Vijay Devarakonda

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్దేవరకొండకు విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11 హాజరుకావాలని సూచించింది. విజయ్దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ప్రకాశ్‌ రాజ్‌ను జులై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement