మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘దృశ్యం-2’ ఈ రోజు అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరేళ్ల క్రితం సెన్సెషనల్ హిట్ సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా మలయాళంలో విడుదలైన ఈ మూవీ సిక్వెల్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సీని రచయిత శీధర్ పిల్లై ట్వీట్ చేశారు.
‘అద్భుతమైన ఆరంభం. దృశ్యం లాగే ఈ సీక్వెల్ కూడా ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతోంది. జీతూ జోసెఫ్ స్మార్ట్ రైటింగ్, థ్రిల్లింగ్ థాట్కు జార్టీ కుట్టిగా మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా దృశ్యంలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలను దర్శకుడు దృశ్యం 2లో చూపించాడు.