
దర్శకుడు, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అనీశ్ ఉపాసన (Aniesh Upaasana) రెండో పెళ్లికి సిద్ధమయ్యా. కారణం.. ఉపాసన బుల్లితెర నటి తుషారా కమలాక్షితో ఉన్న ఫోటోను షేర్ చేయడమే! ఈ పోస్ట్ కింద తుషారాను లైఫ్ పార్ట్నర్ (జీవిత భాగస్వామి)గా అభివర్ణిస్తూనే హార్ట్ సింబల్ జత చేశాడు. ఇది చూసిన అభిమానులు ఈ లవ్ బర్డ్స్కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.
దృశ్యం నటితో పెళ్లి- విడాకులు
అనీశ్ గతంలో నటి అంజలి నాయర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె నెడునల్వాడై, తానక్కరణ్, కలింగళిల్ ఆవల్ వాసంతం, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్, దృశ్యం 2 వంటి చిత్రాల్లో నటించింది. అనీశ్.. మ్యాట్నీ, సెకండ్స్, పాప్కార్న్, జానకి జానే సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు దశాబ్దాలుగా మోహన్లాల్ దగ్గర ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పని చేస్తున్నారు.
త్వరలోనే రెండో పెళ్లి
అనీశ్ దర్శకుడిగా పరిచయమైన మ్యాట్నీ సినిమాలో అంజలి హీరోయిన్గా నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 2011లో పెళ్లిచేసుకోగా.. ఈ జంట ప్రేమకు గుర్తుగా ఓ కూతురు జన్మించింది. తర్వాతేమైందో కానీ 2016లో అంజలి, అనీశ్ విడిపోయారు. 2022లో అంజలి అజిత రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ పాప పుట్టింది.
చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్