శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు.
‘‘చావు నుంచైనా తప్పించుకోవచ్చునేమో కానీ కులం నుంచి తప్పించుకోలేము రా, మన బతుకులు మారాలంటే మనకు కావాల్సింది ఒక్కటే... చదువు... చదువు... చదువు, ఒకటి పెళ్లి దగ్గర... లేకపోతే చావు దగ్గర.. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె.రాబిన్ .


