
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన కొత్త సినిమా 'మార్గన్' (Maargan) నేడు (జూన్ 27)న విడుదలైంది . లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

'మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విజయ్ ఆంటోనిగారి ప్రయాణాన్ని నేను చూస్తూనే ఉన్నాను. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటివారు తీసే చిత్రాలని ఇష్టపడుతుంటాను. అందుకే ‘మార్గన్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను' అని సురేష్ బాబు అన్నారు. సినిమా విడుదల సందర్భంగా ‘మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్’ అంటూ యూనిట్ నిర్వహించిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘‘సురేష్బాబుగారు మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా తొలి సక్సెస్. ఇక ‘మార్గన్’ సాధారణ సీరియల్ కిల్లర్ చిత్రం కాదు. కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది.' అని అన్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తొలి ఆరు నిమిషాల మూవీని చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.