రోడ్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు హెచ్‌ఎంలు విద్యాభివృద్ధికి రథసారథులు ఉట్నూర్‌రూరల్‌: ప్రధానోపాధ్యాయులు విద్యాభివృద్ధికి రథసారథులని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శనివారం కేబీ కాంప్లెక్స్‌ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పదోతరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి న ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ‘బడిబాట’ పోస్టర్‌ ఆవి ష్కరించారు. ప్రతీ గిరిజన గ్రామంలో ఐదేళ్లు నిండి న బాలబాలికలను తప్పనిసరిగా పాఠశాలల్లో చే ర్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడిబా ట కార్యక్రమ నిర్వహణ కోసం ఏటీడీవోలు డివిజన్‌ వారీగా కార్యాచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో డీడీలు రమాదేవి, అంబాజీ, డిప్యూటీ డీ ఈఓ చందన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌రూరల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు చేరుకోలేని గ్రామాలను గుర్తించి, అక్కడి రోడ్ల మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమన్నారు.

మాట్లాడుతున్న పీవో మంద మకరందు

Advertisement
 
Advertisement
Advertisement