ఆలయంలో చోరీ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఆర్ఆర్ఓ కాలనీలోని ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవా రం ఉదయం పూజార్లు వచ్చి చూడగా ఆలయ తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. విగ్రహాలపై ఉన్న బంగారు ఆభరణాలు, వెండి కీరిటాలు, రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. అందులో నగదు తీసుకుని, సమీపంలోని చేలలో హుండీలను పడేశారు. సీసీఫుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రేంకుమార్ తెలిపారు.


