ఉత్తమ అవార్డులు అందుకుని..
జెడ్పీఎస్ఎస్ కూర పాఠశాలలో హెడావు శ్రావణి 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు దీపక్–దీపిక. చిన్న వయసులోనే కథలను రాస్తూ అబ్బురపరుస్తోంది. ఆమె ప్రతిభకు నిదర్శనంగా తెలంగాణ సరస్వత పరిషత్ నుంచి వరుసగా 2024, 2025 సంవత్సరా లకు గాను ఉత్తమ కథ రచయిత అవార్డులు అందుకుంది. ఆమె రాసిన 10 కథల్లో నాలుగు ప్రముఖ పత్రికల్లో ముద్రితమవ్వవడం మరో విశేషం. భావ వ్యక్తీకరణలో పరిణతి, శైలిలో స్పష్టతతో కథలు రాస్తున్న శ్రావణి తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


