పరిహారం చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

పరిహారం చెక్కు అందజేత

Aug 7 2025 9:38 AM | Updated on Aug 7 2025 9:38 AM

పరిహారం చెక్కు అందజేత

పరిహారం చెక్కు అందజేత

లక్సెట్టిపేట: జెండావెంకటాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని తలమల గ్రామ అటవీ శివారులో ఈ నెల 5న చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం యజమాని పూసం లచ్చుకు రూ.12 వేల పరిహారం చెక్కును ఒక్కరోజులోనే అందజేసినట్లు రేంజి అధికారి అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ అల్తాఫ్‌, ఎఫ్‌బీవో చంద్రశేఖర్‌, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

8న ఆర్జీయూకేటీలో ఐదోవిడత కౌన్సెలింగ్‌

బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్‌ కేంద్రాలకు సంబంధించిన స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, జనరల్‌ కోటా అభ్యర్థులకు ఈనెల 8న ఐదోవిడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అర్హత పొందిన అభ్యర్థులు నిజధ్రువీకరణ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ www.rgukt.ac.in ను సందర్శించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement