లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు

Jun 16 2025 6:59 AM | Updated on Jun 16 2025 6:59 AM

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు

మందమర్రిరూరల్‌: మండలంలోని పలు గ్రా మాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర మైనింగ్‌, కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల మంజూ రు పత్రాలు ఆదివారం అందించారు. శంకర్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సండ్రోన్‌పల్లె కేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ కుమార్‌దీపక్‌తో కలిసి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పేదలకు బంగారు భవిష్యత్‌ను అందించేదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సొంతస్థలం ఉండి, ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సతీశ్‌కుమార్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఏరియా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు మంత్రిని కలిశారు. శాలువాలు కప్పి సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement