
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
బెల్లంపల్లిరూరల్: మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలో మంగళవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు రూరల్ సీఐ అఫ్జలొద్దీన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పెద్దదుబ్బ గ్రామ శివారులో తాళ్లగురిజాల ఎస్సై రమేశ్, మండల వ్యవసాయాధికారి ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన మాకినేని వెంకటనారాయణ ఇంట్లో తనిఖీ చేయగా 25 కిలోల పత్తి విత్తనాలు పట్టుబడినట్లు తెలిపారు. వాటి విలువ రూ.90 వేల వరకు ఉంటుందన్నారు. చిలకలూరిపేటకు చెందిన జగన్ వద్దనుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. విత్తనాలను సీజ్ చేసి నిందితునిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.