ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

Jun 18 2025 3:21 AM | Updated on Jun 18 2025 3:21 AM

ఉరేసు

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

భైంసారూరల్‌: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు. మండలంలోని కోతల్‌గాం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కూనేరు ఈరన్న (35) కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మనస్తాపంతో యువతి..

పెంబి: మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘట న మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై అజ య్‌ తెలిపిన వివరాల మేరకు గుమ్మెన ఎంగ్లాపూర్‌ గ్రామానికి చెందిన దాత్తురోళ్ల పోశెట్టి–నర్సవ్వ దంపతుల కుమార్తె గౌరి(22) ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి నర్సవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

లక్సెట్టిపేట: ఒంటరితనం భరించలేక ఏప్రిల్‌ 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెంది నట్లు ఎస్సై సురేశ్‌ తెలిపారు. జెండావెంకటాపూర్‌ గ్రామానికి చెందిన వెల్తెపు బుచ్చయ్య (49) భార్య గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు కు ఇటీవల వివాహం చేసి అత్తారింటికి పంపించా డు. ఒంటరితనం భరించలేక ఏప్రిల్‌ 30న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. గత నెల 31న ఆరోగ్యం క్షీణించడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కోటపల్లి: మండలంలోని పంగిడి సోమారం అటవీ ప్రాంతంలో ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అద్దరపల్లి అశోక్‌ (25) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అ దుపుతప్పి కిందపడడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. నెన్నల మండలం ఖర్జీకి చెందిన అశోక్‌ కోటపల్లి ఆటవీశాఖలో బేస్‌క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

నగల బ్యాగు అప్పగింత

మంచిర్యాలక్రైం: రైల్లో నగలు బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడికి మంచిర్యాల జీఆర్‌పీ పోలీసులు బ్యాగును అందించి నిజాయతీ చాటుకున్నారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన వంశీకృష్ణ మంగళవారం కుటుంబంతో కలిసి విజయవాడ నుంచి జీటీ ఎక్స్‌ప్రెస్‌లో మంచిర్యాలకు వచ్చాడు. స్టేషన్‌లో దిగి నగల బ్యాగును రైలులో మర్చిపోయాడు. జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదే రైలులో ప్రయాణిస్తున్న జీఆర్‌పీ పోలీసు శ్రీనుకు సమాచారం అందించారు. అతని ద్వారా బ్యాగును మంచిర్యాల జీఆర్‌పీ పోలీసులకు అందజేశాడు. అనంతరం నగల బ్యాగును స్థానిక జీఆర్‌పీ పోలీసులు వంశీకృష్ణకు అందజేశారు. బ్యాగులో 10 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు.

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య1
1/1

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement