పెళ్లి.. విడాకులు..! | - | Sakshi
Sakshi News home page

పెళ్లి.. విడాకులు..!

Jun 19 2025 4:22 AM | Updated on Jun 19 2025 4:22 AM

పెళ్ల

పెళ్లి.. విడాకులు..!

చిచ్చురేపుతున్న అనుమానాలు

పెళ్లయిన ఏడాది నుంచే గొడవలు

కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారని తీరు

విచ్ఛిన్నం అవుతున్న కుటుంబాలు

విభేదాలకు కారణాలు...

● మద్యం కారణంగా గొడవలు: 33శాతం

● వరకట్నపు వేధింపులు: 31శాతం

● వివాహేతర సంబంధాలు/అనుమానాలు : 26శాతం

● మగపిల్లలు పుట్టలేదని/సంతానం లేదని : 5శాతం

● ఇతర కారణాలు : 5శాతం

మనస్పర్థలు పెరిగి గొడవలు

చిన్న చిన్న కారణాల కే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి గొడవలకు దారి తీ స్తున్నాయి. దీంతో ఇరువురు పోలీస్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇరు కుటుంబాల సభ్యులతో మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇస్తూ చాలామంది లో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొంద రు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంపతుల మధ్య సఖ్యత తగ్గి పోలీస్‌స్టేషన్‌ వరకు వస్తున్నారు. కొన్ని కుటుంబాలు పంతాలకు వెళ్లి కోర్టుకు వెళ్తున్నారు.

– నరేష్‌కుమార్‌, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్‌, మంచిర్యాల

కుటుంబ వ్యవస్థపై

అవగాహన ఉండాలి

ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కు టుంబ వ్యవస్థపై అ వగాహన, సర్దుబా టు ధోరణి లేకపోవ డం వల్లనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. తల్లిదండ్రుల పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అ క్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి, కుటుంబ వ్యవ స్థ సక్రమంగా నిలబడాలంటే సీ్త్ర పాత్ర ము ఖ్యమైనది. ఎంతటి సమస్య అయినా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది.

– డాక్టర్‌ విశ్వేశ్వర్‌రావు, మానసిక వైద్య

నిపుణులు, మంచిర్యాల

మంచిర్యాలక్రైం: మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఒక్కటవుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో కష్టసుఖాలను సమానంగా పంచుకుంటామని పెళ్లిలో బాస చేస్తున్నారు. కానీ కొత్త జంటలు ఆధిపత్య పోరు.. వివాహేతర సంబంధాలు.. అనుమానాలు.. అపోహాలతో సంసార జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేస్తున్నారు. ఒక్కోసారి విడాకులకూ వెనుదీయడం లేదు. ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులకు పెద్దలను ఆశ్రయిస్తున్నారు. వారు కాదంటే కోర్టు మెట్లెక్కుతున్నారు.

చిన్న చిన్న సమస్యలకే..

జిల్లాలో చిన్న చిన్న తగాదాలకే పోలీసుస్టేషన్లు, కోర్టు వరకు వెళ్లే దంపతుల సంఖ్య పెరిగిపోతోంది. 2024 నుంచి 2025మే వరకు చిన్న చిన్న మనస్పర్థలతో మంచిర్యాల మహిళా పోలీసుస్టేషన్‌లో 388 ఫిర్యాదులు వచ్చాయి. కలిసి ఉండడగానికి ఇష్టపడని మరో 73కుటుంబాలు కోర్టు మెట్లెక్కాయి. వివిధ పోలీసుస్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30ఏళ్లలోపు వారివే ఉండడం గమనార్హం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కి తగ్గేందుకు ఇష్టపడడం లేదు. పెళ్లయిన యువతులు కొత్త కాపురంలోకి అడుగు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు. పుట్టిన రోజు మర్చిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదని, పెళ్లికి ముందు వేరే వారితో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు, అపోహాలకు గురై సమస్య జటిలమయ్యే వరకు వెళ్తోంది. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారిలో ఎవరు ఒకరు లేనిపోని అనుమానాలు పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించకుండా దంపతులు ఒకరిపైనొకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నా మార్పు రాకపోవడం వల్ల విడాకుల వరకు వెళ్తున్నారు.

ప్రేమ వివాహాల్లోనే అధికం

పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్న వారిలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఎక్కువ మంది ఉంటున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు మొదలవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు.

పోలీసులు ఏం చెబుతున్నారంటే..

కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ క నిపించవు. కానీ ఒకరినొకరు శత్రువుల్లా భావిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్న దంపతుల్లో పెళ్ల యి ఏడాది నుంచి నాలుగేళ్లలోపు వారే ఎక్కువ ఉంటున్నారు. విడాకులకు చెప్పే కారణాలు చాలా చి న్నవిగా ఉంటున్నాయి. ఉన్నత విద్యావంతులైన భా ర్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతి లో పంతాలకు పోతున్నారు. ప్రేమ వివాహాలు చే సుకున్న వారు కూడా ఏడాది రెండేళ్లకే అర్థం లేని ప ట్టింపులు, గొడవలతో విడాకుల వరకు వెళ్తున్నారు.

● మంచిర్యాలకు చెందిన ఉద్యోగి రాజు(పేరు మార్చాం) జన్నారానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆనందమయ జీవితానికి గుర్తుగా కూతురు జన్మించింది. ఆ తర్వాత రాజు తన భార్యకు వరుసకు చెల్లెలు అయిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి కులపెద్దల వద్ద పలుమార్లు పంచాయితీ జరిగింది. అయినా మార్పు రాక కోర్టు వరకు వెళ్లింది. కేసు కోర్టులో ఉండగానే సదరు యువతిని రాజు రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురుతో కలిసి కోర్టు చుట్టూ తిరుగుతోంది.

● బెల్లంపల్లికి చెందిన గీత(పేరు మార్చాం)కు అదే ప్రాంతానికి చెందిన విజయ్‌(పేరు మా ర్చాం)తో పెద్ద సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లయిన వారం రోజులకే తమ ఊరిలో స్నేహితురాలి పెళ్లి ఉందంటూ ఇంట్లో నగలన్నీ తీసుకుని పెళ్లికి ముందు ప్రేమించిన మరో యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తన భార్య అదృశ్యమైందని విజయ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలించి గీత, ప్రేమికుడిని పట్టుకున్నారు. విజ య్‌ వారిద్దరిపై కేసు పెట్టాడు. మూడేళ్ల తర్వాత గీత విజయ్‌పై కేసు పెట్టగా.. పోలీసులు ఫాల్స్‌ చేశారు. కానీ గీత కోర్టు నుంచి మళ్లీ ఓపెన్‌ చేయించి విజయ్‌ కోర్టు మెట్లెక్కేలా చేసింది.

మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు

సంత్సరం ఫిర్యాదులు కౌన్సెలింగ్‌ ఎఫ్‌ఐఆర్‌ పెండింగ్‌

2023 315 252 63 00

2024 242 197 45 00

2025(మే వరకు) 195 138 50 06

పెళ్లి.. విడాకులు..!1
1/2

పెళ్లి.. విడాకులు..!

పెళ్లి.. విడాకులు..!2
2/2

పెళ్లి.. విడాకులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement