విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలి

Jun 19 2025 4:22 AM | Updated on Jun 19 2025 4:22 AM

విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలి

విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలి

లక్సెట్టిపేట: విద్యార్థులను ఉపాధ్యాయులు బాధ్యతగా పాఠశాలలో చేర్పించాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించి మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని తెలియజేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన విద్యతోపాటు భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. అనంతరం పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శోభారా ణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కేజీబీవీలో విచారణ

దండేపల్లి: మండల కేంద్రంలోని కేజీబీవీని డీఈవో యాదయ్య బుధవారం సందర్శించారు. సిబ్బంది సమయానికి రావడం లేదని, భోజనం సరిగా పెట్ట డం లేదని ఇటీవల కొందరు విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఈవో విచారణ జరిపారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. అనంతరం వంట సరుకులు పరిశీలించి గడువు ముగిసిన మసాల పొడిని పడేయాలని నిర్వాహకులకు సూచించారు. సెక్టోరియల్‌ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంఈవో చిన్నయ్య, సీసీవో మల్లేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement