
ఇద్దరు వ్యక్తుల బైండోవర్
లక్సెట్టిపేట: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి కారణం లేకుండానే 100 నంబర్కు డయల్ చేస్తున్నారు. పలుమార్లు ఈవిధంగా డయల్ చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకున్నా ఫోన్ చేస్తున్నందున బైండోవర్ చేసినట్లు తెలిపారు.