
బౌలర్లదే జోరు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తుండగా బుధవారం జరిగిన పోటీల్లో బౌలర్లదే హవా కొనసాగింది. రెడ్, బ్లూ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగ్గా, బ్లూ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెడ్ జట్టు బౌలర్లు అద్బుతంగా రాణించగా, డి.లక్ష్మణ్ 4 కీలక వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో రెడ్జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీరామ్ 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడని కోచ్ ప్రదీప్ తెలిపారు.
ఎస్టీపీపీలో అధికారులను బదిలీ చేయాలి
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గత పదేళ్లుగా పాతుకుపోయిన సింగరేణి అధికారులను వెంటనే బదిలీ చేయాలని హెచ్ఎంఎస్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఇంజినీర్గా వచ్చి డీజీఎం స్థాయి దాక ఎదిగినా ప్లాంట్లోనే కొందరు అధికారులు ఉన్నారని ఆరోపించారు. ప్రతీ ఏరియాలో బదిలీలు ఉంటాయని కానీ ఇక్కడ మాత్రం బదిలీ చేయకపోవడానికి ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
పీఎఫ్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి
నస్పూర్: ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ నిధి సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ సూచించారు. బుధవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలకు చెందిన సీఎంపీఎఫ్ జాయింట్ వర్క్షాప్ నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఎస్ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఏజీఎం ఫైనాన్స్ బీభత్స, డీవైజీఎం పర్సనల్ అనిల్కుమార్, మందమర్రి డీవైపీఎం అసిఫ్, బెల్లంపల్లి సీనియర్ పీవో ప్రశాంత్, అధికారులు దేవేందర్రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

బౌలర్లదే జోరు