
భూ వివాదంలో ఇరువర్గాల దాడి
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులో జరిగిన భూ వివాదంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన పనాస గణేశ్ ఆకెనపల్లి శివారు సర్వే నంబర్ 64లో ఉన్న భూమిని మంగళవారం సాయంత్రం దున్నే క్రమంలో పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన సింగతి హైమావతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.