లారీ ఢీకొని ఒకరు.. | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఒకరు..

Jun 19 2025 4:36 AM | Updated on Jun 19 2025 4:36 AM

లారీ ఢీకొని ఒకరు..

లారీ ఢీకొని ఒకరు..

భైంసాటౌన్‌: పట్టణంలోని సాత్‌పూల్‌ వంతెన సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తానూర్‌ మండలం బెలతరోడకు చెందిన చెంచుల సాయినాథ్‌(37) బుధవారం బెల్‌తరోడ వెళ్లి బైక్‌పై భైంసా తిరిగి వస్తున్నాడు. సాత్‌పూల్‌ వంతెన వద్దకు చేరుకోగా, నిర్మల్‌ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న సాయినాథ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ గౌసుద్దీన్‌ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపినాథ్‌ తెలిపారు. సాయినాథ్‌కు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement