
సామాజిక భద్రతకు పింఛన్
పాతమంచిర్యాల: సమాజంలో గౌరవం, సామాజిక భద్రత కల్పించడంతోపాటు ప్రజల కనీస అ వసరాలు తీర్చడానికి ప్రభుత్వం సామాజిక భద్ర త పింఛన్ పథకం అమలు చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేయూత పింఛన్లపై అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వృద్ధులు, దివ్యాంగులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులకు, బీడీ టేకేదారులు, ఒంటరి మహిళలకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. పింఛన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని, పేర్ల చేర్పులు, తొలగింపులపై ప్రజలకు వివరించాలని అన్నా రు. ఈ సమావేశంలో సెర్ప్ సంచాలకులు గోపాల్రావు, డీఆర్డీవో కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈవో గణపతి, మున్సి పల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, తపాలాశాఖ అధికారులు పాల్గొన్నారు.
భూభారతిని వినియోగించుకోవాలి
లక్సెట్టిపేట: ప్రజలు భూభారతి చట్టాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని రైతువేదిక భవనంలో, మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధి కారులు ప్రజల దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాలని అన్నారు. అనంతరం కేజీబీవీ, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు, పుస్తకా లు, అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, అధికారులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్