మల్దకల్ : బావిలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మద్దెలబండ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సరస్వతి (38) భర్త సవారన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారు. సరస్వతి పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో బావిలో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోవడంతో ఈత రాక నీటిలో మునిగి మృతి చెందింది. మహిళ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలోరైతు దుర్మరణం
తాడూరు: వ్యవసాయ పొలానికి వెళ్తున్న ఓ రైతును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుంతకోడూరుకు చెందిన లింగంగౌడ్ (45) తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే ప్రధాన రహదారిపై నడుచుకుంటూ పొలానికి వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని కోరారు.
వ్యక్తి బలవర్మణం
కొల్లాపూర్ రూరల్: మండలంలోని నార్లాపూర్ చెంచుగూడెం గ్రామానికి చెందిన తిరుగుడు బక్కన్న (45) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం భార్య సాలమ్మతో మృతుడు బక్కన్న ఘర్షణ పడ్డాడు. దీంతో ఆమె తన సొంత గ్రామానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకున్నాడు. సాయంత్రం కుమారుడు వచ్చి చూడగా అప్పటికే బక్కన్న మృతి చెందారని తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనపూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
వ్యక్తికి ఏడాది జైలుశిక్ష
మహబూబ్నగర్ క్రైం: భార్యను వేధించిన కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం మంగళవారం ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే నవాబ్పేట మండలం కారూర్కు చెందిన ఆటో డ్రైవర్ కావలి శ్రీనివాస్పై అతని భార్య తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని 2021లో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జీషిట్ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసు మంగళవారం వాదనకు రావడంతో వాదనలు విన్న మెట్రోపాలీటన్ మెజిస్ట్రేట్ కోర్టు కావలి శ్రీనివాస్ను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ మహిళలపై హింసకు పాల్పడితే పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విద్యుత్ షాక్తో ఎద్దు మృతి
మాగనూర్: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వడ్వాట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రైతు వాకిటి చిన్న మారెప్పకు చెందిన ఎద్దు పొలంలో మేత మేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలోకి వెళ్లగా కరెంట్ వైరు తగలడంతో అక్కడికక్కడే మరణించింది. మృతి చెందిన ఎద్దు విలువ రూ.60 ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
వ్యక్తిపై కేసు నమోదు
బిజినేపల్లి: బిజినేపల్లి నుంచి నాగర్కర్నూల్ వైపు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని షీటీం బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు షీ టీం ఇన్చార్జ్ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. నిందితుడిని వికారాబాద్కు చెందిన శివగా గుర్తించామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఏస్పీ రామేశ్వర్ హెచ్చరించారు.
బావిలో పడి మహిళ మృతి
బావిలో పడి మహిళ మృతి