
సర్వర్ బిజీ!
మెట్టుగడ్డ: రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆఫీస్ లాగిన్ సర్వర్ మొరాయించడంతో కార్యాలయాల్లో కార్యాకలాపాలు స్తంభించి దస్తావేజుల ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి అన్ని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయా ల్లో ఆన్లైన్ (సర్వర్) సమస్య తలెత్తడంతో మధ్యా హ్నం వరకు రిజిస్ట్రేషన్లు నిలిచాయి. సర్వర్ పనిచేయక కార్యాలయ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. అమ్మకపు, కొనుగోలుదారులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత సర్వర్ సమస్య తీరడంతో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయంపై మహబూబ్నగర్ సబ్రిజిస్ట్రార్ మొహమ్మద్ హమీద్ను వివరణ కోరగా రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సేవల్లో సమస్య వచ్చిందన్నారు.
● రిజిస్ట్రేషన్ శాఖలో స్తంభించిన కార్యకలాపాలు