
రైతు క్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రైతు క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మహబూబ్నగర్ మండలంలోని ధర్మాపూర్ రైతు వేదికలో కలెక్టర్ విజయేందిర, రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షలు మాఫీ చేసి, రైతులను రుణ విముక్తి చేశామని ఆయన గుర్తు చేశారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉందని విమర్శించారు. వరి వేస్తే నాడు ఉరి అన్నారని, కానీ ప్రజా ప్రభుత్వంలో వరి వేస్తే పండుగ అయిందని, సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం రైతును రాజును చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అనంతరం ధర్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చమ్మ, కృష్ణయ్య, గోవర్ధన్ జీ రైతు కుటుంబం సభ్యులకు రైతు బీమా చెక్కులను కలెక్టర్తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారిణి శ్రుతి, ఎంపీడీఓ కరుణశ్రీ, రాజుగౌడ్, ఎన్ బాలయ్య, శ్రీనివాస్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రతాప్రెడ్డి, ఖాజా, రైతులు తదితరులు పాల్గొన్నారు.