
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
● జూన్ 16 నుంచి జూలై 31 వరకు 45 రోజుల పాటు అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ 0–5 ఏళ్ల పిల్లలలో అతిసార ప్రబలకుండా నివారణలో భాగంగా పీహెచ్సీలు, సబ్సెంటర్ల ద్వారా ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ పాకెట్లు, జింక్ టాబ్లెట్లు పంపిణీ చేయనన్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అతిసార వల్ల దేశంలో 4.8 శాతం పిల్లలు చనిపోతున్నారని తెలిపారు. సోమవారం నుంచి జూలై 31వ తేదీ వరకు ఇంటింటికి ఓఆర్ఎస్ పాకెట్లు, జింక్ టాబ్లెట్ల పంపిణీతో పాటు.. వీటి వినియోగించడంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యాధికారులు సిబ్బంది ఈ విషయంలో సరియైన సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక ఓఆర్ఎస్ పాకెట్ను లీటర్ నీటిలో కలుపుకొని నీళ్ల విరేచనాలున్న పిల్లలకు తాగించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డా.భాస్కర్నాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మజ, జిల్లా మాస్ మీడియా అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 112 ఫిర్యాదులు