పెట్టుబడి డబ్బులు అందాయి | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి డబ్బులు అందాయి

Jun 17 2025 5:28 AM | Updated on Jun 17 2025 5:28 AM

పెట్ట

పెట్టుబడి డబ్బులు అందాయి

ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. రైతు భరోసా డబ్బులతో సాగు పనులు ప్రారంభించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తాను. అప్పులు చేయకుండా రైతు భరోసాతో పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

– జి.కుర్మయ్య, రైతు, కోడూర్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌

అర్హులందరికీ పెట్టుబడి సాయం

జిల్లాలో వానాకాలం సీజన్‌ పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద 2.54 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదలయ్యాయి. మొదటి రోజు ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండెకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇంకా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోని రైతులంతా తమతమ మండలాల వ్యవసాయ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలి.

– బి.వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ఎంతో మేలు..

ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతు భరోసా సాయం జమ చేస్తుండటం సంతోషకరం. ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందజేస్తుండటంతో మా లాంటి చాలా మంది రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి,

రైతు, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌

పెట్టుబడి డబ్బులు అందాయి 
1
1/2

పెట్టుబడి డబ్బులు అందాయి

పెట్టుబడి డబ్బులు అందాయి 
2
2/2

పెట్టుబడి డబ్బులు అందాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement