
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,315 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 63.37 శాతంతో 3368 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,690 మంది బాలురు పరీక్షలు రాయగా 56.1శాతంతో 1,509 మంది, 2,625 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 70.82 శాతంతో 1,859 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరంలో 509 మంది విద్యార్థులు హాజరైతే 343 మంది ఉత్తీర్ణులై 67.39 శాతం నమోదు చేశారు. ఇందులో 343 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా.. 67.64 శాతంతో 232 మంది, బాలికలు 166 మంది హాజరు కాగా.. 66.87 శాతంతో 111 మంది ఉత్తీర్ణత సాధించారు.
● ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ కోర్సుల్లో మొత్తం 2,944 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 49.88శాతంతో 1,469 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 1,811 మంది పరీక్షలకు హాజరైతే 47.73 శాతంతో 865 మంది, బాలికలు 1,133 మంది హాజరైతే 53.31 శాతంతో 604 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి సెకండియర్లో రీకౌంటింగ్, రీ వ్యాలువేషన్కు ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఫస్టియర్లో 63.37 శాతం,సెకండియర్లో 49.88శాతం ఉత్తీర్ణత