ట్రాక్టర్‌పై స్టంట్స్‌..జరిమానా విధింపు | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌పై స్టంట్స్‌..జరిమానా విధింపు

Jun 17 2025 4:58 AM | Updated on Jun 17 2025 4:58 AM

ట్రాక్టర్‌పై స్టంట్స్‌..జరిమానా విధింపు

ట్రాక్టర్‌పై స్టంట్స్‌..జరిమానా విధింపు

మానవపాడు: జాతీయ రహదారిపై స్టంట్స్‌ చేస్తూ ట్రాక్టర్‌ను నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి జరిమానా విధించిన సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ చంద్రకాంత్‌ తెలిపినా వివరాలు.. ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామకృష్ణ మానవపాడు నుంచి ఉండవెల్లి మీదుగా జాతీయ రహదారిపై రెండు రోజుల క్రితం ట్రాక్టర్‌పై విన్యాసాలు చేస్తుండగా మానవపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని మోటార్‌వైకిల్‌ యాక్ట్‌ ప్రకారం రూ.1100 జరిమానా విధి ంచినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.

విద్యుత్‌ తీగలు చోరీ

మానవపాడు: మండలంలోని గోకులపాడు, చెన్నిపాడు గ్రామాల సరిహద్దులోని పొలాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వ్యవసాయ పొలాల్లో మోటర్లు, విద్యుత్‌ వైర్లు, ఫీజులు, పైపుల చోరీకి పాల్పడుతున్నట్లు ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. గోకులపాడుకు చెందిన రైతులు చిన్న నరసింహులు, జమ్మన్న, పలువురి పొలాల్లో చెందిన పొలాల్లో సుమారు రూ.70 వేలు విలువైన విద్యుత్‌ వైర్లు చోరీ జరిగినట్లు సోమవారం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement