
కేఎల్ఐ కాల్వలోపడి వ్యక్తి మృతి
మిడ్జిల్: మండల కేంద్రంలోని కొత్తూర్ రోడ్డు సమీపంలో కేఎల్ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మిడ్జిల్కు చెందిన వస్పరి లోకేష్(నాగయ్య) (34) ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్లాడు. రాత్రి గ్రామంలోని బంధువుల ఇంటి దగ్గర భోజనం చేశాడు, ఇంటికి వెళ్లలేదు, తరచు అతనికి మూర్చవ్యాధి వస్తూ ఉండేది, సోమవారం ఉదయం కొత్తూర్ రోడ్డు సమీపంలోని కేఎల్ఐ కాల్వ బ్రిడ్జి కింద వ్యక్తి పడి ఉండడం చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు లోకేష్ మృతదేహంగా గుర్తించారు. మూర్చవ్యాధితో ప్రమాద వశాత్తు కాల్వలో బ్రిడ్జిపై నుంచి పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్లకు తరలించినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. లోకేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనుమానాస్పదంగా వివాహిత మృతి
కేటీదొడ్డి: అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం గ్రామానికి చెందిన సగడం అనిత(26) తెల్లవారు జామున ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్ధానికులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు వెళ్లి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె బంధువులతో మనస్పర్ధలు ఉన్నాయని, ఆమె గొంతుపై గాట్లు ఉన్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులు వివరణ కోరగా, ఆమె తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
నర్వ: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అంకెన్పల్లికి చెందిన లక్ష్మన్న (54) తన కుమార్తెను చూసేందుకు సోమవారం సాయంత్రం గుడిగండ్లకు బయలుదేరాడు. రాత్రి 8 గంటల సమయంలో పాతర్చేడ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
హన్వాడ: మండలంలోని నాగినోనిపల్లి శివారులో ఈ నెల 13న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని సల్లోనిపల్లికి చెందిన సిరంజి నర్సిములు (45) 13వ తేదీ రాత్రి మహమ్మదాబాద్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నాగినోనిపల్లికి చేరుకోగానే హన్వాడ నుంచి కోస్గి వైపు వెళ్తున్న కారు బైక్ను ఢీకొనడంతో నర్సిములుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని.. తమ్ముడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.