
పచ్చి రొట్టతో ప్రయోజనాలు
పిల్లి పెసర సాగుతో..
ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూత దశలో 4 నుంచి 5 టన్నుల పచ్చి రొట్ట ఇస్తోంది. దీనిని పరిశుభ్రంగా కూడా వాడుకోవచ్చు. ఒక టన్ను పిల్లి పెసరలో 4 కిలోల నత్రజనిని, ఒక కిలో భాస్వరం, 3 కిలోల పోటాష్ లభిస్తోంది. రైతులు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు చల్లుకొని భూముల్లో సేంద్రియ కర్భనం పెంపొందించుకోవాలి.
అలంపూర్ : వరి సాగులో సేంద్రియ ఎరువులను సమపాళ్లలో అందించడంలో రైతులు విఫలమవుతున్నారు. దీంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. వర్షాకాలం ప్రారంభంకావడంతో పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పచ్చి రొట్టె ఎరువుల వినియోగంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ పేర్కొంటున్నారు.
పచ్చి రొట్ట ఎరవులతో కలిగే లాభాలు
పచ్చి రొట్ట వినియోగం వలన ముఖ్యంగా భూమి గుళ్ల బారుతుంది. అలాగే భూసారం కూడా పెరుగుతుంది. పొలానికి నీటిని, పొషక పదార్థాలను నిల్వ ఉంచుకొనే శక్తి పెరుగుతుంది. అలాగే మొక్కల వేర్లకు గాలి, నీరు పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము, జీలుగలు, పెసర వంటి పంటలను పచ్చి రొట్ట విత్తనాలు, ఎరువులను తక్కువగా వినియోగించుకొనే సాగు చేయవచ్చు. భూమిలో ఆమ్ల, క్షార గుణాలను పెంపొందించుకోవచ్చు. మొక్కలకు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా చూసుకోవడంతోపాటు పంట నాణ్యత, దిగుబడులు పెంచేందుకు పచ్చి రొట్ట మేలు చేస్తోంది. వీటి వలన చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. పంటలో కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలో ఇంకేలా చేస్తోంది. పంటలకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మ క్రిములు భూమిలో వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. పప్పు జాతి పచ్చి రొట్ట పైరు వలన భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెరుగుతుంది.
పచ్చి రొట్ట విత్తన ఎరువుల ఎంపిక
పచ్చి రొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా, కాండం వచ్చి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వలన వేర్లపైనే నత్రజని బుడిపెల ద్వారా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండటంతో నీటి ఎద్దడిని తట్టుకొని పెరుగుతాయి. పచ్చి రొట్ట పైర్ల వేర్లు భూమిలోకి చొచ్చుకొనిపోయే గుణం కలిగి ఉంటాయి. త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టేందుకు ఉపయోగపడతాయి.
జీలుగు సాగు
పచ్చి రొట్ట ఎరువుల సాగు చేసుకుంటే భూమికి అవసరమైన సేంద్రియ పదార్ధాల్ని అందిస్తాయి. వీటి వలన భూమిలో సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెందుతాయి. జీలుగలు ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనం కావాలి. పూత దశలో కోసినపుడు ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్ట ఎరువు వస్తోంది. ఒక టన్ను జీలుగ సాగులో ఐదు కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పొటాష్ వస్తుంది. చౌడు భూములకు బాగా పనికొస్తుంది.
జనుములు
ఎకరానికి 20 కిలోల విత్తనం కావాలి. పూత దశ కంటే పంట వేసిన 8 వారాల తర్వాత కోసినప్పుడు 6–8 టన్నుల పచ్చి రొట్ట వస్తోంది. ఒక టన్ను జనుములో నాలుగు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, మూడు కిలోల పొటాష్ ఉంటుంది.
పాడి–పంట

పచ్చి రొట్టతో ప్రయోజనాలు