మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

Jun 18 2025 3:31 AM | Updated on Jun 18 2025 3:31 AM

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని పశుసంవర్ధక, యువజన, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, సెట్విన్‌ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యెన్నం ఆలోచనతో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ కింద సెట్విన్‌ ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. సెట్విన్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. శ్రీనివాస్‌రెడ్డి పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన 3డీ యానిమేటెడ్‌ పుస్తకాలను మార్గదర్శకంగా తీసుకొని మక్తల్‌ నియోజకవర్గంలోని విద్యార్థులకు అందజేయగా.. 62శాతం ఉన్న ఉత్తీర్ణత వందశాతం పెరిగినట్లు పేర్కొన్నారు.

మయూరీ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తాం

మహిళలు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడానికి మయూరీ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని ఎమ్మెల్యే యెన్నం పేర్కొన్నారు. కలెక్టర్‌ విజయేందిరబోయి మాట్లాడుతూ.. జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు మంత్రి, ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రావు, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ చైర్మన్‌ నర్సింహారెడ్డి, ఆనంద్‌గౌడ్‌, ఎన్‌పీ.వెంకటేశ్‌, సురేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, వసంత, సిరాజ్‌ఖాద్రీ, లక్ష్మీప్రసన్న, మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ పర్యవేక్షకులు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

70=

పశుసంవర్ధక, యువజన,క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement