
పార్వతమ్మకు పోలీసుల ఆశ్రయం
ఆత్మకూర్: నవమాసాలు మోసి కనీ పెంచి ప్రయోజకుడిని చేసిన ఆ తల్లిని బస్టాండ్లో వదిలేసిన వెళ్లి న కసాయి కొడుకు.. హృదయవిధారక ఘటనకు సంబంధించి మంగళవారం ‘సాక్షి’లో పట్నం వెళ్దామని.. ఆత్మకూర్లో దింపాడు.. కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఎస్పీ రావుల గిరిధర్ స్పందించి ఘటనపై ఆరాతీసి పార్వతమ్మకు ఆశ్రయం కల్పించాలని సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్కు ఆదేశాలు జారీ చేశారు. సీఐ, ఎస్సై ఆత్మకూర్ బస్టాండ్కు చేరుకొని వృద్ధురాలితో వివరాలు సేకరించారు.
మెరుగైన వైద్యానికి ఎస్పీ సిఫారసు
ఆత్మకూర్ ఆర్టీసీ బస్టాండ్లో దీనిస్థితిలో ఉన్న పార్వతమ్మకు హైదరాద్లోని నిమ్స్లో మెరుగైన వైద్యం చేయించేందుకు ఎస్పీ గిరిధర్ అన్ని ఏర్పాట్లు చేయించారని సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్ తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో పార్వతమ్మ భర్త రామకృష్ణను పిలిపించామని.. కుమారులు భాస్కర్, రాములుపై వనపర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించామని తెలిపారు. పార్వతమ్మ ఆధార్కార్డు ఇతర వివరాలను సేకరించి ఇక్కడి నుంచే అంబులెన్స్లో హైదరాబాద్లోని నిమ్స్కు తరలిస్తామని, తమ సిబ్బందిని వెంట పంపిస్తామని వెల్లడించారు.
‘సాక్షి’ కథనానికి స్పందన
ఎస్పీ ఆదేశాలతో నిమ్స్కు తరలింపు
భర్తను పిలిపించి కుమారులపై ఫిర్యాదు

పార్వతమ్మకు పోలీసుల ఆశ్రయం