
విత్తన నాణ్యతోనే పంట దిగుబడి
ఉపయోగాలు
● రైతులు పైన పేర్కొన్న నాలుగు పద్ధతుల్లో తమ స్థాయిలో మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి.
● మొలక శాతం పరీక్షల అనంతరం పంట పెంచుకోవడం వలన వృథా సమయం కాదు.
● ఎంచుకున్న విత్తనాలు సరైనవా.. కాదా..? అనే విషయం గుర్తించవచ్చు.
● విత్తనాల విషయంలో ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు.
● నాణ్యమైన విత్తనాలను నాటితే అధిక దిగుబడులు పొందవచ్చు.
● మంచి గింజలను ఎంపిక చేసుకోవాలి
● 90 శాతం విత్తనాలు మంచిగా ఉండాలి
అలంపూర్: విత్తనం బాగుంటే మొలక బాగా వస్తుంది. మొలకలు బాగా వస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకే విత్తు కోసం నాణ్యమైన గింజలను ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. నాణ్యమైన విత్తనాలను క్రమ పద్ధతిలో కడితే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. విత్తనాలను మొలక కట్టి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. విత్తనాలను లెక్కించే విధా నాల గురించి రైతులకు ఈ విధంగా వివరించారు.
విత్తన ఎంపిక :
పంట సాగులో విత్తనం ప్రభావం నుంచి విత్తనాన్ని నాటితే ఉత్తమ ఫలితాలను అందుకోవచ్చు. – అనుకూలమైన, ఆరోగ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే రైతులకు అన్ని విధాల శ్రేయస్కరం. విత్తన నాణ్యత ప్రమాణాలను మొలక శాతం ఆధారంగా నిర్దారిస్తారు. అందుకు తెలుగు రాష్ట్రాల్లో విత్తన పరీక్షా కేంద్రాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజేంద్రనగర్, ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి గూడెం, ఎమ్మిగనూరులో విత్తన పరీక్షా కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి విత్తనాలను ఎంపిక చేస్తారు. ఆ విత్తనాలను ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు రైతులకు సరఫరా చేస్తారు. రైతులు పండించిన పంట నుంచి కూడా విత్తనాలు తయారు చేసుకోవ చ్చు. విత్తనాలను మొలక కట్టి వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. రైతులు నాలుగు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని తెలుసుకోనే పద్ధతులు ఉన్నాయి.
పేపర్ టవల్ పద్ధతి : పేపర్ టవల్ లేదా మండపాటి బట్టను తీసుకొని బాగా తడిపి గచ్చు నేలపై పరిచి 100 గింజలను వరుసలో అమర్చాలి. దీనిపై మరో తడి పేపర్ టవల్ను పరచి రెండింటిని కలిపి చాపలా చూట్టాలి. చివర్లో దారంతో చుట్టి ఏదైనా పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడుపుతు ఉండాలి. ఈ పద్ధతి ద్వారా వరి, జొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను పరీక్షించుకోవచ్చు.
ట్రే పద్ధతి : లావు గింజ రకాలైన పత్తి, వేరుశనగ, ఆముదం వంటి విత్తనాలను ఇసుక పోసిన ప్లాస్టిక్ ట్రేలో వేయాలి. 100 విత్తనాలను అంగుళం లోతు ఇసుకలో విత్తుకోవాలి. తేమ ఉండేటట్లు నీళ్లు చల్లుతు ఉండాలి.
పెట్రి డిష్ పద్ధతి : వంగ, టమాట, మిరప వంటి చిన్న విత్తనం మొలకలను పరీక్షించుకోవచ్చు. పెట్రిడిష్లో బ్లాటింగ్ పేపరును అమర్చి నీటితో తడపాలి.
గుడ్డమూట పద్ధతి : మొలక కట్టాల్సిన 100 విత్తనాలను గుడ్డలో మూతకట్టి దీనిని చిన్న ప్లేటులో పెట్టి అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా 5 నుంచి 10 రోజుల్లో మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు.
మొలక శాతం : ● సామాన్యంగా పరీక్షకు తీసిన శాంపిల్ గింజల్లో నూటికి 99 శాతం మంచి గింజలు ఉండాలి.
● మొక్కజొన్నకు 90 శాతం మొలకలు రావాలి.
● ఇతర ధాన్యాలకు 75నుంచి 80శాతం మొలకలు రావాలి.
● పప్పుదినుసులకు 75నుంచి 80శాతం మొలకలు రావాలి.
● నునెగింజలకు 70నుంచి 80శాతం మొలకలు రావాలి.
● పత్తి, బెండ విత్తనాలకు 65 శాతం రావాలి.
పాడి–పంట

విత్తన నాణ్యతోనే పంట దిగుబడి

విత్తన నాణ్యతోనే పంట దిగుబడి