
అందరిపై జగద్గురువుల ఆశీస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: మనందరిపై జగద్గురువుల దివ్య ఆశీస్సులు ఉండాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పాలమూరు పట్టణానికి సమీపంలోని శ్రీవాసవీ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన యుగమానోత్సవం, బసవేశ్వర జయంత్యుత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని మాట్లాడుతూ.. బసవేశ్వరుడు విప్లవవాది అని, సమసమాజ స్థాపనకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. అందరూ సమానమేనని, అందరిని సమాన దృష్టితో చూడాలని ఆయన తెలియజేసినట్లు చెప్పారు. ఆయన స్ఫూర్తితో సమాజంలో కులమతాలు బేధాలు లేకుండా సమానత్వంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. కాశీ, ఉజ్జయిని ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రొఫెసర్ చంద్రశేఖర్రెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా చిన్నారులు, యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ భక్తిపాటలకు భరతన్యాటం, కూచిపూడి నాట్యం చేసి అలరించారు.
హాజరైన జగద్గురువులు
మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జగద్గురువులు, స్వామిజీలు హాజరయ్యారు. ఉజ్జయిని సద్ధర్మ సింహాసనాధీశ్వర శ్రీ10008 జగద్గురు శ్రీసిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య, శ్రీశైల సూర్యసింహాసనాధీశ్వర శ్రీ1008 జగద్గురు శ్రీడాక్టర్ చన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య, కాశీ జ్ఞానసింహాసనాధీశ్వర 1008 జగద్గురు శ్రీడాక్టర్ చంద్రశేఖర శివాచార్య, డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు పాల్గొన్నారు. అనంతరం స్వామిజీలు భక్తిప్రవచనాలు చేశారు. ఉదయం ఇష్టలింగ పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్, ముక్తా శ్రీశైలం, రాజశేఖరస్వామి, సిద్ధిరామప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
పాలమూరులో వైభవంగా పంచాచార్య యుగమానోత్సవం,
బసవేశ్వర జయంత్యుత్సవం
హాజరైన జగద్గురువులు –
వేలాదిగా పాల్గొన్న ప్రజలు

అందరిపై జగద్గురువుల ఆశీస్సులు

అందరిపై జగద్గురువుల ఆశీస్సులు