
పీర్ల పండుగను గుర్తించాలి: టీఎఫ్టీయూ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీర్ల పండుగను తెలంగాణ పండుగగా గుర్తించాలని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పీర్ల నిర్వాహకుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీర్ల పండుగ నిర్వహణ(మొహర్రం)లో ముజావర్లు, ముల్లాలు, సవారి ఎత్తేవారు, డప్పులు కొట్టే, భాజాభజంత్రీలు వాయించే కళాకారులు ఎలాంటి పారితోషికం లేకుండా సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం తెలంగాణచౌరస్తా వరకు ఊరేగింపుగా వెళ్లి కొద్దిసేపు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గట్టన్న, సంఘం నాయకులు ముజీబ్, మద్దూర్ చారి, మహమ్మద్ రఫీ, సత్యనారాయణ, యాదయ్య, జలాల్పాషా, జాహెద్, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ పాల్గొన్నారు.