డెంగీతో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలిక మృతి

Aug 16 2025 7:28 AM | Updated on Aug 16 2025 7:28 AM

డెంగీతో బాలిక మృతి

డెంగీతో బాలిక మృతి

వేలేరు: డెంగీ జర్వంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్‌ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement