అలంకరణ లైట్లు సర్దుతుండగా.. | - | Sakshi
Sakshi News home page

అలంకరణ లైట్లు సర్దుతుండగా..

Aug 13 2025 5:20 AM | Updated on Aug 13 2025 5:20 AM

అలంకరణ లైట్లు  సర్దుతుండగా..

అలంకరణ లైట్లు సర్దుతుండగా..

తొర్రూరు: అలంకరణ లైట్లు సర్దుతుండగా ఓ యువకుడు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజా మున మహబూ బాబా ద్‌ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్‌ కథనం ప్రకారం.. తొర్రూరు మండలం పెద్దమంగ్యా తండాకు చెందిన జాటోత్‌ సుమన్‌(30) వారాంతపు సంతల్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూ రు పట్టణం 2వ వార్డులోని అరుణోదయ కాలనీలో కొత్త ఇల్లు నిర్మించుకుని సోమవారం గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశాడు. మంగళవారం బంధువులకు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంటి గోడపై అలంకరణ లైట్లు సర్దుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి కుప్పకూలాడు. బంధువులు గుర్తించి విద్యుత్‌ నిలిపివేసి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమన్‌కు గతంలో ఓ మహిళతో వివాహమై విడాకులు కాగా ప్రస్తుతం మరో మహిళతో సహ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

తొర్రూరులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement