మేం 18 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి దాదాపు రూ.30 వేల వరకు పెట్టాం. కత్తెర పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2400 ఉంటే దళారీలు.. రూ.1500 ధరతో అడుగుతున్నారు. తెలంగాణలో అటు ఖరీఫ్, ఇటు రబీ సీజన్లలో పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. క్వింటాకు రూ.900 వరకు నష్టపోతున్నాం. ఇప్పటికై న చంద్రబాబు ప్రభుత్వం చొరువ తీసుకొని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
– తిరుమలేశ్వరరెడ్డి, మొక్కజొన్న రైతు,
రేమడూరు గ్రామం, కల్లూరు మండలం


