స్విమ్మింగ్ పోటీలో స్టాఫ్ నర్సు ప్రతిభ
కర్నూలు(హాస్పిటల్): విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న డి. మంజులాదేవి ప్రతిభ చూపారు. విజయవాడలోని సర్ విజ్జి మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ ఫూల్లో ఆరవ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఇందులో మంజులదేవికి వంద మీటర్ల ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్లలో రెండు గోల్డ్మెడల్లు, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్లలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు.
రేపు పలు ప్రాజెక్టులకు
వర్చువల్గా సీఎం శంకుస్థాపన
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఏపీఐఐసీ, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారన్నారు. ఆయా ప్రాజెక్టుల వద్ద లబ్ధిదారుడు, స్టేక్ హోల్డర్తో మాట్లాడుతారని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ నూరుల్ ఖమర్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.


