కార్తీక మాసం మూడో సోమవారం..
శైవక్షేత్రాలు ప్రణవ నాదంతో ప్రతిధ్వనించాయి. పంచాక్షరి మంత్రంతో మర్మోగాయి. లింగాకారుడు.. సర్వ శుభంకరుడు అయిన పరమేశ్వురున్ని వేడుకోవడానికి భక్తులు వేలాదిగా శైవాలయాలకు తరలివచ్చారు. ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపకాంతులతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. కార్తీక ఉత్సవాలను పురస్కరించుకుని పలుచోట్ల అంగరంగ వైభవంగా గ్రామోత్సవాలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు
అలరించాయి. భక్తుల సౌకర్యార్థం దాతలు అన్నదానం చేశారు. – సాక్షినెట్వర్క్
‘ప్రణవ’ పావనం