ఆసిఫాబాద్ పోలీసులకు మూడు రజత పతకాలు
ఆసిఫాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మైదానంలో నిర్వహిస్తున్న నాలుగో తె లంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో సెపక్ తక్రా విభాగంలో జిల్లా పోలీస్ క్రీడాకారులు కాళేశ్వ రం జోన్ రన్నరప్గా నిలిచి రజత పతకాలు సాధించారు. ఈ విజయంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు ఏఆర్ హెడ్క్వార్టర్స్కు చెందిన పోలీస్ సి బ్బంది పొట్ట గోపి (కెప్టెన్), కిరణ్కుమార్, రాజేశ్ ర జత పతకాలు కై వసం చేసుకున్నారు. వీరితో పాటు జిల్లా కేంద్రంలోని ఏఆర్ పీసీ సువార్త మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ ఓపెన్లో సిల్వర్ మెడల్ సా ధించారు. కెప్టెన్గా వ్యవహరించిన గోపి ఈ నెల 23నుంచి 27వరకు కేరళలో నిర్వహించే ఆల్ ఇండి యా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొననున్నారు. ఎస్పీ నితిక పంత్ విజేతలను అభినందించారు. భ విష్యత్లోనూ మరిన్ని పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎదగాలని, క్రీడల్లో సిబ్బందిని ప్రోత్సహించడంలో పోలీస్శాఖ ముందుంటుందని తెలిపారు.
సిల్వర్ మెడల్ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ సువార్త
పతకాలు సాధించిన ఏఆర్ పోలీసులు
ఆసిఫాబాద్ పోలీసులకు మూడు రజత పతకాలు


